నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన Janhvi Kapoor !

by Dishanational2 |
నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన Janhvi Kapoor !
X

దిశ, సినిమా: దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తక్కు సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బాలీవుడ్‌లో కొంత కాలంగా నెపోటిజం గురించి చర్చ జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నా జాన్వీ నెపోటిజం గురించి మాట్లాడింది. 'నటన రాకున్నా ఎందుకు నటిస్తున్నావ్? బ్యాక్ గ్రౌండ్ వల్లే ఇక్కడున్నారని ఎవరైనా అంటే బాధేస్తుంది. మేము ఎలా కష్టపడుతున్నామో మాకే తెలుసు. అది అనేవాళ్లు చూడరు. అందుకే వారి విమర్శలు వినేందుకు నేనూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా నటనలో లోపముంటే మార్చుకోమని సలహా చెబితే వింటాను. కానీ, కొందరు చాలా చెత్తగా మాట్లాడతారు. నా సంతోషాన్ని పాడు చేస్తారు. నా మూవీ చూడం పక్కన పెడితే ప్రతిఒక్కరూ నాకు ఈ జీవితం సులభంగా దొరికింది అంటుంటారు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి :

ప్రత్యేక పూజలు చేస్తున్న తమన్న.. ఇలా మారిపోయిందేంటి?

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మొదటి ట్రాన్స్‌జెండర్స్ జంట.


Next Story